
ఎస్పీ కార్యాలయాలనికి 30 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 30 అర్జీలు అందాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, చీటింగ్ వంటి వాటిపై అర్జీలు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎస్ఐ డి.వెంకన్న, అర్జీదారులు, తదితరులు పాల్గొన్నారు.