
పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా రోడ్డు నిర్మాణం
మాకవరపాలెం: ఏపీఐఐసీ భూమిలో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా యలమంచిలి నియోజకవర్గంలో పెదపల్లికి నూతనంగా రోడ్డు నిర్మించనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మండలంలోని రాచపల్లి ప్రాంతంలో 17 ఏళ్ల కిత్రం ఆన్రాక్ రిఫైనరీ నిర్మాణం కోసం అప్పట్లో 2,400 ఎకరాల భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మిగిలిన మరో 309 ఎకరాల భూమిని నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణతో కలసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న భూమిని పరిశ్రమల స్థాపనకు కేటాయించనున్నట్టు చెప్పారు. అందుకు వీలుగా రోడ్డు సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా రామన్నపాలెం జంక్షన్ నుంచి యరకన్నపాలెం మీదుగా యలమంచిలి నియోజకవర్గంలోని పెదపల్లి వద్ద హైవేను కలుపుతూ 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చామని, నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ రామారావు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయ కృష్ణన్