చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం

May 27 2025 12:46 AM | Updated on May 27 2025 12:46 AM

చట్ట

చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 40 అర్జీలు అందాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా అర్జీదారుల సమస్యలు వింటూ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్‌ తదితర అంశాలపై ఫిర్యాదు వచ్చాయని చెప్పారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహనరావు, ఎస్‌ఐ డి.వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

చోరీ సొత్తు ఇప్పించాలి..

ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఇంటిలో కుటుంబ సమేతంగా మేడపైన నిద్రపోతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు 8.5 తులాల బంగారం ఆభరణాలు పట్టుకుపోయారు. సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. అక్కడ పోలీసుల్లో స్పందన లేకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాం. త్వరితగతిన చోరీ సొత్తు ఇప్పించాలి.

– ఉడత పైడమ్మ, టెక్కలిపాలెం,

సబ్బవరం మండలం

స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

నాకు తల్లిదండ్రులు ఇచ్చిన 3 సెంట్ల భూమి ఉంది. 2012 డిసెంబర్‌ 28న నా స్థలం పక్కన ఉన్న వ్యక్తి ఆక్రమించాడు. అప్పటి నుంచి నేటి వరకూ ఎస్పీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై మునగపాక పోలీస్‌స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేశాను. ఎప్పుడు పరిష్కరిస్తారో అర్థం కావడం లేదు.

– చిట్టిబోయిన కన్నయ్యమ్మ, టి.సిరసపల్లి గ్రామం, మునగపాక మండలం

చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం 1
1/2

చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం

చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం 2
2/2

చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement