యోగాంధ్రను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రను విజయవంతం చేయాలి

May 26 2025 1:14 AM | Updated on May 26 2025 1:14 AM

యోగాం

యోగాంధ్రను విజయవంతం చేయాలి

అనకాపల్లి: యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని, దీనిలో మాస్టర్‌ ట్రైనర్ల పాత్ర కీలకమని కలెక్టరు విజయ కృష్ణన్‌ అన్నారు. స్థానిక గవరపాలెం రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో రెండో రోజు ఆదివారం జరిగిన యోగా మాస్టర్‌ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ శిక్షణ తీసుకున్న ట్రైనర్లు గ్రామాల్లో కనీసం 50 మందికి తక్కువ కాకుండా యోగా నేర్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్‌లో నమోదు కావాలని, ప్రజలు పెద్దఎత్తున యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యే విధంగా అవగాహన, ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా చేసేవిధంగా ప్రోత్సహించాలని, యోగాతో ఆరోగ్యం లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి కె.మనోరమ, జిల్లా ఆయుష్‌ అధికారి కె.లావణ్య, యోగా మాస్టరు ట్రైనర్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

యోగాంధ్రను విజయవంతం చేయాలి 1
1/1

యోగాంధ్రను విజయవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement