
2న ‘ఆపరేషన్ కగార్ లోగుట్టు’పై జిల్లా సదస్సు
అనకాపల్లి టౌన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ లోగుట్టు అనే అంశంపైన వచ్చే నెల 2న పట్టణంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన సదస్సు ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సదస్సుకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు వి.ఎస్. కృష్ణ, ఏపీ ఆదివాసీ సంఘం గౌరవ అధ్యక్షుడు పి.ఎస్. అజయ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. అభ్యుదయవాదులు, విద్యావంతులు, కార్మిక, కర్షకులు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు.