పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలు

May 24 2025 1:19 AM | Updated on May 24 2025 1:19 AM

పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలు

పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలు

కశింకోట: ఆర్‌ఈసీఎస్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న రాజీవ్‌గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాలలో 50 శాతం విద్యుత్‌త్‌ వినియోగదారుల విద్యార్థుల కోటా సీట్లలో ప్రవేశానికి దరఖాస్తు విక్రయాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్‌ఈసీఎస్‌ ఎండీ జి.ప్రసాద్‌ మాట్లాడుతూ సంస్థ పరిధిలోని కశింకోట, మునగపాక, అనకాపల్లి గ్రామీణం, సబ్బవరం, పరవాడ మండలాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారుల పిల్లల సర్టిఫికెట్లు పరిశీలన జరిపిన అనంతరం దరఖాస్తులను పూరించి కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు. కళాశాల పనిదినాల్లో దరఖాస్తులు పొందాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం వర్తింపు జరుగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ బి.ఉమాశంకర్‌, అసోసియేట్‌ ప్రిన్సిపాల్‌ కర్రి శివ, విభాగాధిపతి గణేష్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement