
విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి
కశింకోట: మండలంలోని ఏఎస్ పేట శివారు గొబ్బూరుపాలెంలో మంగళవారం ఓ మహిళా రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సీఐ స్వామినాయుడు వివరాల ప్రకారం.. జెట్టపురెడ్డితునికి చెందిన చవితిన చెల్లయమ్మ (54) గొబ్బూరుపాలెం వద్ద తన చెరకు తోటకు నీరు పెట్టడానికి వెళ్లి వ్యవసాయ విద్యుత్ మోటారు స్విచ్చాన్ చేసింది. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు రమణబాబు ఇచ్చిన ఫిర్యా దు మేరకు ఎస్ఐ కె.రమణమ్మ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చెల్లయమ్మ (ఫైలు)

విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి