
31 వరకు చిన్నారులకు టీకాలు
రావికమతం: జిల్లాలో ఈనెల 31వ తేదీ వరకు చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. రావికమతం పీహెచ్సీని మంగళవారం ఆయన సందర్శించారు. పీహెచ్సీలో తిరిగి రోగులతో మాట్లాడారు. పిల్లల వ్యాక్సిన్ నిల్వలు, రిఫ్రిజిరేటర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్ను పరీశీలించారు. రికార్డులు, రిపోర్టులను తనిఖీ చేశారు. మీజిల్స్ రుబెల్లా టీకా స్పెషల్ డ్రైవ్లో భాగంగా చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి రామచంద్రరావు, అరుణాచలం, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నళిని పుష్ప, సీహెచ్వో హేమ సుందరరావు, సూపర్ వైజర్ సత్యనారాయణ, ఏఎన్ఎం రమణమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.