లేటరైట్‌ తవ్వకాలు నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

లేటరైట్‌ తవ్వకాలు నిలిపివేయాలి

May 6 2025 1:14 AM | Updated on May 6 2025 1:14 AM

లేటరైట్‌ తవ్వకాలు నిలిపివేయాలి

లేటరైట్‌ తవ్వకాలు నిలిపివేయాలి

గిరిజనుల హక్కులకు విఘాతం

స్పీకర్‌ కల్పించుకోవాలి

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం డిమాండ్‌

నాతవరం: అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో జరుగుతున్న అక్రమ లేటరైట్‌ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. అసనగిరి పంచాయతీ శివారు బమ్మిడికలొద్దు ప్రాంతంలో జరుగుతున్న లేటరైట్‌ తవ్వకాలను సోమవారం సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న లేటరైట్‌ తవ్వకాలను యుద్ధప్రాతిపదికన నిలుపుదల చేయకపోతే ఉద్యమిస్తామన్నారు. ఈ ప్రాంతం 1/70 యాక్టు పరిధిలో ఉందని, లేటరైట్‌ తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులను ఉల్లంఘించి చేస్తున్న ఈ తవ్వకాల కారణంగా అడవి బిడ్డల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. గతంలో లేటరైట్‌ తవ్వకాలను వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు ప్రోత్సహించడం సిగ్గు చేటన్నారు. ఇదే కొనసాగితే ఈ ప్రాంత గిరిజనులు జీవనం సాగిస్తున్న అటవీ సంపదతో పాటు జీడిమామిడి తోటలు నాశనం అవుతాయన్నారు. లేటరైట్‌ తవ్వకాలు ఆపకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత గిరిజనులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు అడిగర్ల రాజు, పార్టీ సీనియర్‌ నాయకుడు త్రిమూర్తులురెడ్డి, రాజవొమ్మంగి మండల పార్టీ కార్యదర్శి సూరిబాబు, ప్రజా నాణ్యమండలి నాయకుడు రమేష్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement