
ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీలకు చైత్రదీపిక
నర్సీపట్నం: ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు నర్సీపట్నానికి చెందిన క్రీడాకారిణి పెదిరెడ్ల చైత్రదీపిక ఎంపికై ంది. గత నెల 16 నుంచి 30వ తేదీ వరకు మొహలీ, పంజాబ్లో జరిగిన భారత ఆర్టిస్టిక్ రోలరు స్కేటింగ్ జట్టు ఎంపిక పోటీలో చైత్రదీపిక యూత్ కేటగిరి పెయిర్ స్కేటింగ్లో మెరుగైన ప్రతిభ చాటి భారత జట్టులో స్థానం సాధించింది. దక్షిణ కొరియాలో జూలై 20 నుంచి 30వ తేదీ వరకు జరిగే 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనుంది. చైత్రదీపిక తన ప్రతిభను వరుసగా మూడవసారి అంతర్జాతీయస్థాయిలో చాటేందుకు అవకాశం వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు పేరు తీసుకురానుంది.