
తల్లీ కుమార్తెలకు అవార్డులు
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె కలగర్ల సాహితీలకు మరోసారి అవార్డులు వరించాయి. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాలు అందించారు. విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న నాగజ్యోతికి ‘ఇంటర్నేషనల్ బెస్ట్ ఎచీవర్ అవార్డు’, క్రీడల్లో రాణిస్తున్న ఆమె కుమార్తె సాహితికి ‘భారత్ సమ్మాన్ అవార్డు’ వరించాయి. ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ వరల్డ్ వైడ్ ఫౌండేషన్ ఈ అవార్డులను అందజేసింది.