పేదల గూడు... పట్టదు గోడు | - | Sakshi
Sakshi News home page

పేదల గూడు... పట్టదు గోడు

Jun 2 2025 1:37 AM | Updated on Jun 2 2025 1:37 AM

పేదల

పేదల గూడు... పట్టదు గోడు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తాం. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తాం. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోం.

– పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు హామీ

సాక్షి, అనకాపల్లి: ప్రతిపేదవాడి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం ఊదరగొడతారు. ఈ ఏడాది కాలంలో ఆయన మాటలను, పాలనను పరిశీలిస్తే పొంతన లేదని ఎవరికై నా ఇట్టే తెలిసిపోతుంది. బోగస్‌ హామీలు, మాయ మాటలు ఆయన సొత్తని రుజువు అవుతుంది. దానికి ప్రబల ఉదాహరణ పేదల ఇళ్లు. రెండు సెంట్ల స్థలం, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కనీసం ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ ఏడాది కాలంలో ఒక్క ఇల్లు, సెంటు స్థలం మంజూరు చేయకపోగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు నిలిపివేసి ఘనతకెక్కారు. ఆయా కాలనీల్లో కనీస వసతులు కల్పించకుండా పేదల బతుకులతో ఆటలాడుకుంటున్నారు. పేదోడి సొంతింటి కల సాకారమయ్యేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా స్థలం అందజేయడంతో పాటు ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ప్రతి గ్రామంలో జగనన్న కాలనీల పేరిట కొత్త ఊళ్లు వెలిశాయి. మీ ఇల్లెక్కడ.. అంటే సమాధానం చెప్పుకోలేని నిరుపేదలకు జగనన్నకాలనీల్లో శాశ్వత చిరునామాలు లభించాయి. తనకు ఓ ఇల్లు ఉందని పేదోడు గర్వంగా తలెత్తుకుని చెప్పుకునే విధంగా అర్హతున్న ప్రతి ఒక్కరికీ సెంటున్నర స్థలాన్ని ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టారు. రాజకీయాలతీతంగా, పార్టీ జెండా చూడకుండా పేదోడనే అర్హతే ప్రామాణికంగా వై.ఎస్‌. జగన్‌ సర్కార్‌ ఇళ్లు మంజూరు చేస్తే..కూటమి ఏడాది పాలనలో పేదల ఇళ్ల నిర్మాణ బిల్లులను కూడా నిలిపివేసింది. రెండు సెంట్లు స్థలం ఉచితంగా ఇస్తామనే ఎన్నికల హామీని గద్దెనెక్కిన తర్వాత అలవాటు ప్రకారం విస్మరించింది. ఉన్నవి పోయి...కొత్తవి రాక దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారు.

చినుకుపడితే చిత్తడే..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తిమ్మరాజు పేట జగనన్నకాలనీలో ఉచితంగా సెంటున్నర స్థలం ఇచ్చి, ఇల్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే మా కాలనీలో నాతో పాటు సుమారు 34 మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి మా కాలనీలో రహదారి, డ్రైనేజీ సదుపాయం కల్పించలేదు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. వర్షాకాలం వస్తే ఇంటికెళ్లే రహదారి బురద మయంగా ఉంటుంది.

– కోలమూరి బాబురావు, తిమ్మరాజుపేట, మునగకపాక మండలం

ప్రతి పేదోడికి సొంతింటి కల నెరవేర్చాలనే ఆశయంతో గత ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి గ్రామంలో జగనన్న కాలనీల లేఅవుట్లు వేసి సెంటున్నర స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే ఆ కాలనీలపై కూటమి ప్రభుత్వం కినుకు వహించింది. వాటివైపు కన్నెత్తి చూడడం లేదు. కనీస మౌలిక వసతులు కల్పించలేదు. గతంలో వేసిన అంతర్గత రోడ్లకు ఇరువైపులా తుప్పులు పేరుకుపోయి ఉన్నా కనీసం తొలిగించే ప్రయత్నం కూడా అధికారులు చేయడంలేదు. జగనన్నకాలనీల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా గతంలో వాటర్‌ ట్యాంక్‌లు,, విద్యుత్‌ స్తంభాలకు నిధులు మంజూరు చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో ఆ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

పేదలను దగా చేసిన కూటమి ప్రభుత్వం

ఏడాది పాలనలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజలు

ఇంటి కోసం ఒక్కరికీ సెంటు స్థలం కూడా ఇవ్వని పరిస్థితి

గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు బిల్లుల నిలిపివేత

సగంలోనే నిలిచిపోయిన వందలాది ఇళ్లు

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించని సర్కార్‌

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 682 జగనన్నకాలనీలు అభివృద్ధి

సుమారు 58,571 ఇళ్లు మంజూరు

24,060 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ

జగనన్న

కాలనీలపై కినుకు

పేదల గూడు... పట్టదు గోడు 1
1/6

పేదల గూడు... పట్టదు గోడు

పేదల గూడు... పట్టదు గోడు 2
2/6

పేదల గూడు... పట్టదు గోడు

పేదల గూడు... పట్టదు గోడు 3
3/6

పేదల గూడు... పట్టదు గోడు

పేదల గూడు... పట్టదు గోడు 4
4/6

పేదల గూడు... పట్టదు గోడు

పేదల గూడు... పట్టదు గోడు 5
5/6

పేదల గూడు... పట్టదు గోడు

పేదల గూడు... పట్టదు గోడు 6
6/6

పేదల గూడు... పట్టదు గోడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement