
283 మంది పోలీస్ సిబ్బందికి ఆన్లైన్ బదిలీలు
ఆన్లైన్లో పోలీస్ సిబ్బంది బదిలీ ప్రక్రియను పరిశీలిస్తున్న ఏఎస్పీ దేవప్రసాద్
అనకాపల్లి: వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదు సంవత్సరాలు పైబడి విధులు నిర్వహిస్తున్న పోలీసులను ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీ చేయనున్నట్టు జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ చెప్పారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి ఈ విషయం వివరించారు. సీనియార్టీ ప్రకారం సిబ్బందిని బదిలీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 283 మందికి బదిలీలు జరుగుతున్నాయని, వారిలో 161 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 95 మంది హెడ్ కానిస్టేబుల్స్, 27 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారని చెప్పారు. శుక్రవారం బదిలీల ప్రక్రియ ప్రారంభించామన్నారు. క్రైం అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, పరిపాలన అధికారి ఎ.రామ్కుమార్, ఎస్ఐ సురేష్, సూపరింటెండెంట్ గిరి తదితరులు పాల్గొన్నారు.