
మలేషియాలో చిక్కుకున్న జి.నగరంవాసి
మాకవరపాలెం: ఉపాధి కోసం వెళ్లిన ఓ వ్యక్తి మలేషియాలో చిక్కుకున్నాడు. మండలంలోని జి.నగరం గ్రామానికి చెందిన ఒమ్మి భూషణం ఉపాధి నిమిత్తం 2019లో మలేషియా వెళ్లాడు. మూడేళ్లపాటు బాగానే ఉన్నా.. అనంతరం ఇబ్బందులు మొదలయ్యాయి. స్వగ్రామానికి పంపాలని భూషణం ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఎనిమిది నెలల క్రితం తన కుమార్తె వివాహానికి వెళ్తానన్నా పంపించలేదని శనివారం వీడియో ద్వారా తెలియజేశాడు. తన పాస్పోర్ట్, వీసా తీసుకుని ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తనను స్వగ్రామం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా కోరాడు.