లైన్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఘనసత్కారం | - | Sakshi
Sakshi News home page

లైన్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఘనసత్కారం

Mar 19 2025 1:26 AM | Updated on Mar 19 2025 1:23 AM

మాణిక్యాలరావు దంపతులను సత్కరిస్తున్న డీఈ, ఇతర సిబ్బంది

మాకవరపాలెం : జాతీయ అవార్డు అందుకున్న విద్యుత్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ బొంతు మాణిక్యాలరావును ఘనంగా సత్కరించారు. స్థానిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో రెండున్నరేళ్లుగా లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మాణిక్యాలరావు జాతీయ లైన్‌మెన్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 4న ఢిల్లీలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి చేతుల మీదుగా మాణిక్యాలరావు అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది సబ్‌ స్టేషన్‌ వద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు దంపతులను నర్సీపట్నం డీఈ రామకృష్ణ, ఏడి త్రినాథరావు, స్థానిక ఏఈ బాలకృష్ణ, ఇతర సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వివిద మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement