మహారాణిపేట: అనకాపల్లి లోని శ్రీ నూకాంబికా అమ్మ వారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సింహాచలం దేవ స్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పని చేస్తున్న వెంపలి రాంబాబు నియమితులయ్యారు. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న రాంబాబును ఇటీవల సింహాచలం దేవస్థానం అసిస్టెంట్ కార్యనిర్వహణాధికారి (ఏఈవో)గా బదిలీ చేశారు. ఆయనకు సహాయ కమిషనర్గా పదోన్న తి లభించడంతో అనకాపల్లి దేవస్థానానికి సహా య కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా నియమించారు. ప్రస్తుతం నూకాలమ్మ అమ్మవా రి దేవస్థానం ఇన్చార్జి ఈవోగా దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఎన్.సుజాత పని చేస్తున్నారు. శనివారం వెంపలి రాంబాబు ఈవోగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.
ఉక్కు ఎస్ఎంఎస్లో ప్రమాదం
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్ఎంఎస్)–2 విభాగంలో శుక్రవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగికి గాయాలయ్యాయి. కార్మిక నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఎంఎస్–2 విభాగం కన్వర్టర్స్లోని హాట్మెటల్ చెక్ చేసే సమయంలో ఒక్కసారిగా స్లాగ్ బయటకు తుల్లింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి బలిరెడ్డి పెంటయ్యపై స్లాగ్ పడటంతో గాయపడ్డాడు. బాధితుడిని ఉక్కు జనరల్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.