●అనకాపల్లి రామచంద్ర థియేటర్ జంక్షన్లో ఏర్పాటు చేసిన శివరామకృష్ణ స్వీట్స్ షాపులో ‘సాక్షి’ ఒక కేజీ మిక్సర్, ఒక కేజీ స్వీట్ తీసుకొని తూకం వేయగా.. ఒక్క గ్రాము కూడా తేడా లేకుండా సరిసమానంగా వచ్చింది. దుకాణ యాజమాని పతివాడ రామకృష్ణ మాట్లాడుతూ.. మోసం లేకుండా అమ్మితే వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతుందని, దీర్ఘకాలంలో వ్యాపారాభివృద్ధికి అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
●గాంధీ మార్కెట్లో సురేష్ కిరాణా హోల్సేల్ షాపునకు వెళ్లి ఒక కేజీ కందిపప్పు తూకం వేయగా సరిగా ఉంది.
●అనకాపల్లిలో సిద్ధి లింగేశ్వరరావుస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీజయలక్ష్మీ ఎంపోరియం టీ పొడి షాపులో ఒక కేజీ టీ పొడి తూకం తూయగా సమానంగానే వచ్చింది.
●గాంధీ మార్కెట్లో బెల్లం షాపులో 9.5 కేజీ బెల్లం దిమ్మ తూకం వేయగా సరిగానే ఉంది
●గాంధీ మార్కెట్లో కూరగాయలు అమ్మే మహిళా వ్యాపారి దగ్గర ఒక కేజీ బెండకాయలు తూకం వేయగా.. 20 గ్రాములు తక్కువగా వచ్చింది. మరో రెండు బెండకాయలు వేయగా తూకం సరిపోయింది.
కచ్చితంగా తూకం వేస్తున్న దుకాణాలూ ఉన్నాయి..