అచ్యుతాపురం రూరల్ : నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గురువారం పూడిమడకలో సారాకు వ్యతిరేకంగా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ డి.శ్రీరామ చంద్రమూర్తి, అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ ఎౖక్సైజ్ అధికారి వి.సుధీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా ఏపీ ప్రొహిబిషన్ చట్టం 1995 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సారా సంబంధిత ఫిర్యాదుల కోసం 14405 టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయాలని సూచించారు. సారా రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు ప్రారంభించిన నవోద యం 2.0 కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు. యలమంచిలి ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ పి.తేజో వెంకట కుమార్, ఎస్ఐ సుధాకర్, ఎస్ఐ వెంకటరావు, మహిళా పోలీసులు రేవతి, రత్నకుమారి, వీఆర్వో కిరణ్ పాల్గొన్నారు.