ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో

Mar 14 2025 1:57 AM | Updated on Mar 14 2025 1:52 AM

ఆటో డ్రైవర్‌ మృతి

చోడవరం : వెంకన్నపాలెం–సబ్బవరం రోడ్డులో జరిగి న ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి చెందాడు. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఆటో ఢీకొట్టిన ఘటనలో ఆటోడ్రైవర్‌ డి.నర్సింగరావు (54) అక్కడికక్కడే మృతిచెందాడు. సబ్బవరం మండలం ఆరిపాక గ్రామానికి చెందిన నర్సింగరావు తన ఆటోతో బుధవారం రాత్రి వెంకన్నపాలెం వైపు వస్తుండగా చోడవరం మండలం అడ్డూరు గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతదేహానికి గురువారం పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement