క్లస్టర్‌ శిక్షణతో నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

క్లస్టర్‌ శిక్షణతో నాణ్యమైన విద్య

Mar 13 2025 11:56 AM | Updated on Mar 13 2025 11:52 AM

● డీఈవో గిడ్డి అప్పారావునాయుడు

మాడుగుల: రానున్న విద్యా సంవత్సరంలో నాణ్యమైన విద్యను అందించడానికి క్లస్టర్‌ కాంప్లెక్స్‌ పరిధిలో ఉపాధాయులకు ఏటా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు డీఈవో గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. బుధవారం మాడుగుల క్లస్టర్‌ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనలో మెలకువలతో పాటు విద్యార్థులకు అర్థమయ్యేలా తరగతులు నిర్వహించడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మండలంలో మాడుగుల, కేజేపురం, కింతలి క్లస్టర్‌ కాంప్లెక్స్‌లో 281 మందికి గాను 265 మంది ఉపాధ్యాయలు శిక్షణకు హాజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బి.దేముడమ్మ, డీఈవో అసిస్టెంట్‌ వెంకటేశ్వర్లు, కింతలి క్లస్టర్‌ అబ్జర్వరు రాధాకృష్ణమూర్తి, సీఆర్‌పీలు వొమ్మలి అచ్చుతరావు, బొబ్బిలి హరికృష్ణ, శారద, సురేష్‌, నిద్దాన సంధ్య, క్లస్టర్‌ హెచ్‌ఎంలు, రిసోర్స్‌ పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement