ఎన్నికల ముందు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇంతవరకు అతీగతీ లేదు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏటా విద్యార్థులకు వసతి దీవెన, విద్యాదీవెన తదితర పథకాలు పక్కాగా అమలు జరిగేవి. దీంతో పిల్లలను చదివించడం సులువయ్యేది. ఇప్పుడు అప్పులు చేయాల్సివస్తోంది. యువత పోరు కార్యక్రమం ద్వారా అయినా విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.
–కాండ్రేగుల జగన్, విద్యార్థిని తండ్రి, తిమ్మరాజుపేట, మునగపాక మండలం