
తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులు
నక్కపల్లి: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారిని పుణ్యకోటి వాహనంలో ఊరేగించారు. సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి గ్రామ బలిహరణలు పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఉంచి ఉదయం తిరువీధి సేవలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని పుణ్యకోటి వాహనంలో ఉంచి రాత్రి తిరువీధి సేవలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, గోపాలాచార్యులు, రాజగోపాలాచార్యు లు, సాయి ఆచార్యులు పాల్గొన్నారు.