ఇంటింటికీ పరిశుభ్రమైన తాగునీరు జేజేఎం లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ పరిశుభ్రమైన తాగునీరు జేజేఎం లక్ష్యం

Sep 25 2023 1:48 AM | Updated on Sep 25 2023 1:48 AM

సమావేశంలో మాట్లాడుతున్న 
నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ సభ్యులు - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ సభ్యులు

మాడుగుల : ఇంటింటికీ పరిశుభ్రమైన తాగునీరు అందించడమే జేజేఎం లక్ష్యం అన్ని నేషనల్‌ జల్‌జీవన్‌ మిషన్‌ సభ్యుడు ఈశ్వరచంద్‌ జైన్‌ తెలిపారు. హర్‌ఘర్‌జల్‌ కార్యక్రమంలో భాగంగా చీడికాడ మండలంలో బి.సింగవరం, తంగుడుబిల్లి, వింటిపాలెం గ్రామాల్లో ఆదివారం నేషనల్‌ జలజీవన్‌ మిషన్‌ సభ్యులు పర్యటించారు. రక్షిత మంచి నీటిపథకాలు, పంప్‌హౌస్‌లతో పాటు ఇంటింటికీ కనెక్షన్లను పరిశీలించారు. ప్రతి నెలా విలేజ్‌ వాటర్‌ శానిటేషన్‌ కమిటీ ద్వారా గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నీరు, పారిశుధ్యం గురించి చర్చించుకోవాలన్నారు. జాలంపల్లి పంచాయితీ శివారు గిరి గ్రామం మేడవీధిలో 10 వేల లీటర్ల సామర్ధ్యం గల మంచినీటి పథకాన్ని పరిశీలించారు. కుళాయిల ద్వారా సురక్షితమైన జలం వస్తుందో లేదోనని పరిశీలించి తాగునీరు బాగుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి పారిశుధ్యంతో పాటు తాగునీరు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వం లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో ఎక్కడా మురుగు నీరు నిలిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కిముడు రమణమ్మ, సర్పంచ్‌ ధారా మల్లేశ్వరి చిన్ని, ఉపసర్పంచ్‌ బోర లక్ష్మి చిన్న, నేషనల్‌ జల్‌ జీవన్‌ సభ్యులు సుశీల్‌ కుమార్‌ చౌబె, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ బి.నాగేశ్వరరావు, డిఈ ఎ. సూర్యనారాయణ, ఏఈ నరసింగరావు, పంచాయతీ కార్యదర్శి గెంజి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ సభ్యుడు ఈశ్వర చంద్‌ జైన్‌

క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement