
వినతులు స్వీకరిస్తున్న డీఆర్వో దయానిధి
తుమ్మపాల : కలెక్టరేట్లో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. గ్రీవెన్స్ చేసుకునేందుకు ఆయా శాఖల ఉద్యోగుల వినతులను జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి స్వీకరించారు. వారి సమస్యలను ఆయా శాఖల అధికారుల ద్వారా పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతుందన్నారు. గ్రీవెన్స్లో మొత్తం మూడు అర్జీలు నమోదయ్యాయి.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో...
అనకాపల్లిటౌన్ : స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందికి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ముగ్గురు పోలీస్ సిబ్బంది వారివారి అనారోగ్య, ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను తెలియజేయడం జరిగిందని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ చెప్పారు. వివరాలను పరిశీలించి సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.