దిశ యాప్ ద్వారా యువకుడి ఆటకట్టు
కోటవురట్ల: దిశ యాప్ ఓ బాలికకు రక్షణ కల్పించింది. యువకుడి వేధింపులకు ముగింపు పలికింది. తంగేడు గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన ఎం.ప్రసాద్ అనే యువకుడు మొబైల్ వాట్సాప్ మెసేజీల ద్వారా వేధిస్తున్నాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో దిశ ఎస్వోఎస్కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేధింపులకు పాల్పడిన యువకుడిని ప్రసాద్గా గుర్తించారు. ఇరు పక్షాల పెద్దల సమక్షంలో పోలీసులు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి వేధిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించి బైండోవర్ చేశారు. దీనిపై కేసు నమోదు కాలేదని ఎస్ఐ నారాయణరావు తెలిపారు.