కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంచు, చలి తీవ్రతకు మన్యంవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం జి. మాడుగులలో 3.8 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 6.4 డిగీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి అరకువ్యాలీలో 7.2 డిగ్రీలు, పెదబయలులో 8.8 డిగ్రీలు, హుకుంపేటలో 9.0 డిగ్రీలు, పాడేరులో 9.6 డిగ్రీలు, చింతపల్లిలో 1.8 డిగ్రీలు, కొయ్యూరులో 12.8 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు.
●రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.8 డిగ్రీలు, మారేడుమిల్లిలో 11.3 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.5 డిగ్రీలు, అడ్డతీగలలో 15.1 డిగ్రీలు, రంపచోడవరంలో 15.8 డిగ్రీలు, చింతూరు డివివిజన్ చింతూరులో 13.9 డిగ్రీలు, ఎటపాకలో 14.2 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 9గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు.
జి.మాడుగుల: చలి తీవ్రతకు మండల ప్రజలు వణికిపోతున్నారు. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డు, నుర్మతి, సొలభం, గెమ్మెలి మార్గాల్లో పొగమంచు తెరలు కమ్మేశాయి. దీంతో రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు.
కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు


