18న సహస్ర ఘటాభిషేకం | - | Sakshi
Sakshi News home page

18న సహస్ర ఘటాభిషేకం

Dec 15 2025 8:50 AM | Updated on Dec 15 2025 8:50 AM

18న సహస్ర ఘటాభిషేకం

18న సహస్ర ఘటాభిషేకం

డాబాగార్డెన్స్‌ (విశాఖ): సిరులతల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న నాలుగో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల వరకు అమ్మవారికి మహానివేదన(రాజభోగం), 12 నుంచి 3 గంటల వరకు సర్వదర్శనం అనంతరం దర్శనాలు నిలిపివేయనున్నారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన అనంతరం 7 నుంచి అమ్మవారి దర్శనాలకు అనుమతి కల్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 20 వేల మంది భక్తులకు మహాన్నదాన కార్యక్రమం టౌన్‌ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయ మెయిన్‌రోడ్డులో నిర్వహించనున్నారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 సాయంత్రం 6.30 గంటల నుంచి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో దేవస్థానం, ఇతర దేవాలయాలకు చెందిన నాదస్వరం, డోలు విద్వాన్లచే నాదస్వర కచేరీ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement