పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
సాక్షి,పాడేరు: విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినాన్ని మంగళవారం తలారిసింగి మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తూ పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, పోలీసు అధికారులు అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చెక్లను కలెక్టర్, ఎస్పీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత్–చైనా సరిహద్దులో హిమాలయాల్లో గీస్తీ నిర్వహిస్తున్న డీఎస్పీ కరణ్సింగ్, సీఆర్పీఎఫ్ జవానులపై శత్రువులు దాడి చేశారని, సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారన్నారు. వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకొంటున్నామన్నారు. ఎస్పీ అమిత్బర్దర్ మాట్లాడుతూ ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీసుశాఖ అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు.
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
చింతూరు: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దివాకర్ అన్నారు. చింతూరు పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం చింతూరులో ర్యా లీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూ దేశరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడేక్రమంలో ఎందరో పోలీసులు బలవుతున్నారని, అలాంటి పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్, సీఆర్పీ ఎఫ్ జవాన్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్కుమార్
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం


