మరణించి నలుగురికి వెలుగునిచ్చి.. | - | Sakshi
Sakshi News home page

మరణించి నలుగురికి వెలుగునిచ్చి..

Sep 6 2025 5:15 AM | Updated on Sep 6 2025 5:15 AM

మరణిం

మరణించి నలుగురికి వెలుగునిచ్చి..

పెందుర్తి : బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందిన ఓ వ్యక్తి నేత్రాల ను దానం చేసి ఓ కుటుంబం మానవత్వం చాటుకుంది. వివరాలివి.. పెందుర్తి ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్న కోరుబిల్లి శ్రీను(40) క్రేన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి శ్రీను ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ క్రమంలో శ్రీను సమీప బంధువు శరగడం రాము(కర్రల రాము) చొరవతో కుటుంబ సభ్యులు శ్రీను నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. మోషిన్‌ ఐ బ్యాంక్‌ ప్రతినిధులు శ్రీను నేత్రాలను సేకరించారు. ఇటీవల కాలంలో విస్తృతంగా నేత్రదా నం చేయిస్తున్న పెందుర్తిలోని సాయి హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ట్రస్ట్‌ స్ఫూర్తిలో తాము ఈ నేత్రదానం చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మరణించి నలుగురికి వెలుగునిచ్చి.. 1
1/1

మరణించి నలుగురికి వెలుగునిచ్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement