గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి

Jul 12 2025 8:15 AM | Updated on Jul 12 2025 9:23 AM

గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి

గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి

అడ్డతీగల: త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, ఈ నెలాఖరులోగా గృహ ప్రవేశాలు చేసేందుకు ల బ్ధిదారులు సిద్ధం కావాలని గృహనిర్మాణశాఖ రాష్ట్ర ప్రత్యేకాధికారి పి.వెంకటరమణ సూచించారు.అడ్డతీగల మండలం కొత్తపాలెం,గొండోలు గ్రామాల్లో పీఎంఎవై గ్రామీణ్‌, పీఎం జన్‌మన్‌ పథకాల కింద నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడు లేని ప్రతి నిరుపేదలకు సొంత గృహం ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులందరూ ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.రంపచోడవరం డివిజన్‌ ఈఈ ఎ.రవికుమార్‌,డీఈఈ శ్రీరామచంద్రమూర్తి, ఏఈ రాజశేఖర్‌,ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రత్యేకాధికారి వెంకటరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement