
పర్యాటకుల కారుకు ప్రమాదం
● అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన వాహనం
డుంబ్రిగుడ: మండలంలోని జాతీయ రహదారి జైపూర్ జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం పర్యాటకుల కారు ప్రమాదానికి గురైంది. తెలంగాణకు చెందిన పర్యాటకులు కారులో శుక్రవారం అరకు వచ్చారు. ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించిన అనంతరం చాపరాయి జలవిహారి సందర్శనకు బయలుదేరారు. జైపూర్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న పర్యాటకులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.