
మనస్తాపంతో గృహిణి ఆత్మహత్య
● భర్త తీరే కారణమని పోలీసుల వెల్లడి
ముంచంగిపుట్టు: మనస్తాపానికి గురైన ఓ గృహిణి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్.రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కుజభంగి గ్రామానికి చెందిన కిల్లో తిరుపతి, కిల్లో స్వప్న భార్యభర్తలు. ఈ నెల 26వ తేదీ గురువారం భర్త తిరుపతి వేరే మహిళలతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడటాన్ని భార్య స్వప్న గమనించింది. వెంటనే అతన్ని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మానసిక వేదనకు గురైన ఆమె ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. వెంటనే భర్త, స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లే చూసేసరికి ఆమె చున్నీతో ఉరిపోసుకుని కనిపించింది. చావుబ తుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న ఆమెను ప్రైవేట్ వాహనంలో హుటాహుటిన కిలగా డ పీహెచ్సీకి తీసుకువచ్చారు.వైద్య సేవలు పొందుతూ స్వప్న మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీలో మార్చురీకి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది కుజభంగి గ్రామానికి వెళ్లి స్వప్న మృతికి గల కారణా లను భర్త తిరుపతి, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కు టుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ తెలిపారు.