జగన్నాథుని రథయాత్రకు పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

జగన్నాథుని రథయాత్రకు పోటెత్తిన భక్తజనం

Jun 28 2025 8:07 AM | Updated on Jun 28 2025 8:07 AM

జగన్నాథుని రథయాత్రకు పోటెత్తిన భక్తజనం

జగన్నాథుని రథయాత్రకు పోటెత్తిన భక్తజనం

ముంచంగిపుట్టు: మండలంలోని ఏనుగురాయి పంచాయతీ కొండపడలో శుక్రవారం నిర్వహించిన జగన్నాథుని రథయాత్రకు భక్తులు పోటెత్తారు. మండల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నేతలు కుటుంబ సమేతంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, సర్పంచ్‌ నర్సింగరావు, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దార్రెల, ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీ, పాడువ గ్రామాల్లో జగన్నాథుని రథయాత్ర వైభవంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement