
జగన్నాథుని రథయాత్రకు పోటెత్తిన భక్తజనం
ముంచంగిపుట్టు: మండలంలోని ఏనుగురాయి పంచాయతీ కొండపడలో శుక్రవారం నిర్వహించిన జగన్నాథుని రథయాత్రకు భక్తులు పోటెత్తారు. మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నేతలు కుటుంబ సమేతంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, సర్పంచ్ నర్సింగరావు, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దార్రెల, ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీ, పాడువ గ్రామాల్లో జగన్నాథుని రథయాత్ర వైభవంగా నిర్వహించారు.