
చింతపల్లి ఏడీగా తిరుమలరావు
● బాధ్యతల స్వీకరణ
● ఇక్కడి ఏడీకి అనకాపల్లి జిల్లా
ఎలమంచిలి బదిలీ
చింతపల్లి: వ్యవసాయశాఖ చింతపల్లి ఏడీగా బీవీ తిరుమలరావు నియమితులయ్యారు.ఇక్కడ ఏడీ కంఠా జాహ్నవికి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి బదిలీ అయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఏడీగా పనిచేస్తున్న తిరుమలరావును ఇక్కడ నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనను చింతపల్లి, జీకేవీధి వ్యవసాయశాఖ అధికారులు శ్రీనివాసరావు, మధుసూదనరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.