ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

May 25 2025 7:21 AM | Updated on May 25 2025 7:21 AM

ప్రాణ

ప్రాణం తీసిన ఈత సరదా

పెందుర్తి: స్నేహితులతో కలిసి మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌కు సరదాగా ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందాడు. పెందుర్తి సీఐ కె.వి.సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాలివి.. 93వ వార్డు ప్రహ్లాదపురానికి చెందిన దాసరి విజయ్‌కుమార్‌(41) స్థానికంగా ఉన్న కొందరు స్నేహితులతో కలిసి శనివారం ఉదయం మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌కు వెళ్లాడు. అక్కడ పార్టీ చేసుకున్నారు. అనంతరం స్నేహితులతో కలిసి రిజర్వాయర్‌లో ఈదుతున్న సమయంలో విజయ్‌కుమార్‌ గల్లంతయ్యాడు. దీంతో అతడి స్నేహితులు గజ ఈతగాళ్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న జీవీఎంసీ లైఫ్‌గార్డులు విజయ్‌కుమార్‌ కోసం గాలించగా.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతదేహం లభించింది. పెందుర్తి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం విజయ్‌ మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుడు విజయ్‌ స్థానికంగా చిన్నపాటి కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణం తీసిన ఈత సరదా 1
1/1

ప్రాణం తీసిన ఈత సరదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement