12 బాలల సంరక్షణ కేంద్రాలకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

12 బాలల సంరక్షణ కేంద్రాలకు గుర్తింపు

May 19 2025 2:05 AM | Updated on May 19 2025 2:05 AM

12 బాలల సంరక్షణ కేంద్రాలకు గుర్తింపు

12 బాలల సంరక్షణ కేంద్రాలకు గుర్తింపు

పాడేరు : జిల్లాలో 12 బాలల సంరక్షణ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. బాలల సంక్షేమం, సంస్కరణలు, వీధి బాలల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ కేంద్రాల నిర్వహణకు రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం కోసం సుమారు 16 సంరక్షణ కేంద్రాల ప్రతినిధులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ పీడీ సూర్యలక్ష్మి, జువైనల్‌ ప్రొబేషన్‌ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిర్వహణకు అనువుగా ఉన్న 12 బాలల సంరక్షణ కేంద్రాలను గుర్తించారు. ఈ మేరకు వారికి ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement