
గ్రామ సభలు నిర్వహించాలి
సీలేరు: గ్రామస్థాయి లో ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు పూర్తిస్థాయి అధికారులతో గ్రామ సభ లు నిర్వహించాలని సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా కాంగ్రెస్ డీసీసీ కార్యదర్శి శ్రీనివాసు అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో అధికారులతో గ్రామసభలు జరిగేవని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. తూతూ మంత్రంగా సభల నిర్వహణతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. దీనిపై కలెక్టరు దినేష్కుమార్ వెంటనే స్పందించారన్నారు. గ్రామస్థాయి అధికారులకు సమస్యలు పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, తాగునీరు ,రహదారుల సమస్యల వంటివి వెంటనే పరిష్కరించాలని కోరారు.