
మెరిసిన గిరిజన విద్యార్థినులు
● గురుకులాల పరిధి
ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు
వై.రామవరం: మండలంలోని పి.యర్రగొండ గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు గిరిజన సంక్షేమ గురుకులాల పరిధిలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్టు ప్రిన్సిపాల్ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. అదే కళాశాలకు చెందిన కడాల హరిచందన సాయిప్రియ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 1000కు 981, డి. సర్వాణిశ్రీ సునంద మొదటి సంవత్సరంలో 470కు 464 మార్కులు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు.

మెరిసిన గిరిజన విద్యార్థినులు