
ముత్యాలమ్మా.. దండాలమ్మా
చింతపల్లి: మండల కేంద్రంలోని ముత్యాలమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పలు వీధుల మీదుగా అమ్మవారి సారెను ఊరేగించారు. అనంతరం అమ్మవారికి సారే, చీరలను నైవేధ్యంగా సమర్పించారు. ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన జరిగింది. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు వినాయకరావు, భేతాళుడు, నాగేశ్వరరావు,రమేష్, రమణ.హరీష్ తదితరలు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
తరలివచ్చిన భక్తులు