రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు మృతి

May 1 2025 2:02 AM | Updated on May 1 2025 2:02 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు మృతి

వి.ఆర్‌.పురం: మండలంలోని రామవరం సబరిరాయిగూడెం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రగాఢ సానుభూతి తెలిపి, సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గ్రామస్తులు తెలిపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామవరం పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కారం చంద్రయ్య(30), మడకం నరేష్‌(33) వి.ఆర్‌.పురంలో క్రికెటమ్యాచ్‌ ఆడిన అనంతరం బైక్‌పై శబరిగూడెం వెళ్తుండగా సబరిరాయిగూడెం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వీరి వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు, తలకు బాగా బలమైన గాయాలయ్యాయి. ఇందులో మడకం నరేష్‌నుం చింతూరు ఆస్పత్రికి, కారం చంద్రయ్యను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబాలకు మృతదేహాలను అందజేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడం పార్టీకి తీరని లోటు అనిఅన్నారు. ఆయా కార్యకర్తల పార్ధీవదేహాలను సందర్శించి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. నాయకులు బోడ్డు సత్యనారాయణ, చిక్కల బాలు, సర్పంచ్‌ పిట్టా రామారావు, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు జయరాజు, గ్రామస్తులు తదితరులున్నారు.

మృతుల కుటుంబాలకు

సంతాపం తెలిపిన పార్టీ శ్రేణులు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు మృతి1
1/2

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు మృతి2
2/2

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement