ప్రశాంతంగా పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష

May 1 2025 2:02 AM | Updated on May 1 2025 2:02 AM

ప్రశా

ప్రశాంతంగా పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష

సాక్షి,పాడేరు: జిల్లాలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. 11 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు 2,441 మంది విద్యార్థులు హాల్‌టికెట్లు పొందారు. వీరిలో 1,791మంది హాజరుకాగా, 650 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రం పాడేరులోని ఆరు పరీక్ష కేంద్రాల్లో 1,317 మందికి గాను 923 మంది, రంపచోడవరంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 386 మందికిగాను 252 మంది, చింతూరులో 115 మందికి గాను 94 మంది, ఎటపాకలో 295 మందికి గాను 267 మంది, చింతపల్లి పరీక్ష కేంద్రంలో 328 మందికిగాను 255 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పలుశాఖల అధికారులు పర్యవేక్షించారు. పాడేరులోని ఆరు పరీక్ష కేంద్రాల్లో పాడేరు జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సుజాత, ఇతర సాంకేతిక విద్యాశాఖ అధికారులు తనిఖీలు జరిపారు.

73.37శాతం హాజరు

ప్రశాంతంగా పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష 1
1/1

ప్రశాంతంగా పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement