
జీవో 3కు చట్టబద్ధత కల్పించిన తర్వాతే మెగా డీఎస్సీ
డుంబ్రిగుడ: విద్యా శాఖ మంత్రి నారా లోకేష్బాబు జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించిన తర్వాతే జనరల్, మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిన్నస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనేక మంది గిరిజన యువత ఉన్నత చదువులు చేసి ఉద్యోగాలు లేక చైన్నె, బెంగళూరు, కాకినాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో ఉద్యోగాలు గిరిజనులకు దక్కేలా జీవో జారీ చేయాలని కోరారు. నాయకుడు లక్ష్మయ్య, డీఎస్సీ అభ్యర్థులు సోమేశ్వరరావు, కిరణ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడుపాచిపెంట చిన్నస్వామి డిమాండ్