టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

సాక్షి,పాడేరు: జిల్లాలోని 24 పరీక్షా కేంద్రాల్లో టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 4,165 మంది విద్యార్థులు గత పరీక్షలలో ఫెయిలయ్యారు. వీరిలో తెలుగు పరీక్షకు సంబంధించి 1674 మంది విద్యార్థులు హాల్‌ టికెట్లు పొందగా,1642 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 232 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. మౌలిక వసతులు కల్పించారు. జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణాపురం,తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠఽశాల పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి సలీంబాషా తనిఖీ చేశారు.




 

Read also in:
Back to Top