భూ భారతితో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో రైతులకు మేలు

Apr 23 2025 7:47 AM | Updated on Apr 23 2025 8:59 AM

భూ భారతితో రైతులకు మేలు

భూ భారతితో రైతులకు మేలు

● కలెక్టర్‌ రాజర్షి షా

బోథ్‌: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. మండలంలోని ధన్నూర్‌ బి గ్రామంలో భూ భారతి చట్టంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రైతులకు సంబంధించి అనేక సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు. అనంతరం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోథ్‌ తహసీల్దార్‌ సుభాష్‌ చందర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నూ తన చట్టంపై అవగాహన కల్పించారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, బోథ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొడ్డు గంగారెడ్డి, ఆర్డీవో వినోద్‌కుమార్‌, బోథ్‌ మండల స్పె షల్‌ ఆఫీసర్‌ వాజీద్‌ పాల్గొన్నారు. సొనాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు రైతులు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఫిర్యాదులు పక్కాగా నమోదు చేయాలి

కై లాస్‌నగర్‌: భూభారతి గ్రీవెన్స్‌లో వచ్చే ఫిర్యాదులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్‌ రాజ ర్షి షా అన్నారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, తాగునీటి సరఫరాపై సంబంధిత అధికా రులతో గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్ష నిర్వహించా రు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న భూ భారతి అవగాహన సదస్సుల్లో రైతులు, రైతు అసోసియేష న్‌, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. అంతకు ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ భారతి, హౌసింగ్‌శాఖ పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. ఇందులో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, ఆర్డీ వో వినోద్‌కుమార్‌, జెడ్పీ సీఈవో జితేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement