breaking news
water increased
-
భూగర్భ జలాలకు మేలు!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు వర్షాలతో వేసవి ముగియక ముందే రాష్ట్రంలో భూగర్భ జలమట్టాల్లో పెరుగుదల ప్రారంభమైంది. మండుటెండలు, సాగు, తాగు, ఇతర అవసరాలకు నీటి వినియోగం అధికంగా ఉండటంతో గత ఏప్రిల్ నాటికి భూగర్భ జలాల రాష్ట్ర సగటు మట్టం 10.17 మీటర్ల లోతుకు పడిపోయింది. ముందస్తుగా రుతుపవనాల రాకతో ఆ తర్వాతి మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ నెలలో రాష్ట్ర భూగర్భ జలమట్టాల సగటు లోతు 10.07 మీటర్లకు తగ్గింది. 2024 మేతో పోల్చితే 2025 మేలో 0.30 మీటర్ల పెరుగుదల కనిపించింది.వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూగర్భ జల మట్టాలు మరింతగా పెరగనున్నాయి. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ ఏప్రిల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 15 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 15.44 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 5.68 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ⇒ భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. ఒక్క జిల్లాలో కూడా 0–5 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టం లేదని గుర్తించారు. ⇒ 17 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతులో, 13 జిల్లాల్లో 10–15 మీటర్ల లోతులో, 3 జిల్లాల్లో 15 మీటర్లకి మించిన లోతులో భూగర్భ జలాలున్నట్టు తేలింది. ⇒ 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. 15 జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సాధారణానికి మించి 32% అధిక వర్షపాతం గతేడాది రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 919 మి.మీ.లు కాగా, 2024–25 నీటి సంవత్సరంలో 1,216 మి.మీ.ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే, 2024 జూన్ నుంచి 2025 మే చివరి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 32శాతం అధిక వర్షం కురిసింది.19 జిల్లాల్లో భూగర్భ జలాల వృద్ధి2024 మేతో పోల్చితే 2025 మేలో 19 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో వృద్ధి నమోదు కాగా, మరో 14 జిల్లాల్లో క్షీణత కనిపించింది. గత ఏడాది మేలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 10.36 మీటర్లు కాగా.. ఈ ఏడాది మేలో 10.07 మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 2.3 మీటర్లు, అత్యల్పంగా గద్వాల జిల్లాలో 0.05 మీటర్ల వృద్ధి నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 3.02 మీటర్లు, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 0.01 మీటర్ల క్షీణత కనిపించింది.ఈ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో..రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నైరుతి, మధ్య ప్రాంతాలు, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, నాగర్కర్నూల్ జిల్లాలోని దక్షిణాది ప్రాంతాలు, నిర్మల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని పశ్చిమ ప్రాంతాలు, భూపాలపల్లి జిల్లాలోని ఉత్తర, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయికి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మధ్య, కొన్నిచోట్ల 20 మీటర్లకన్నా లోతుకు వెళ్లిపోయినట్టు తేల్చారు. రాష్ట్ర భూభాగం ఈ ప్రాంతాల వాటా 14 శాతం కావడం గమనార్హం. -
మూడు, నాలుగు రోజుల్లో నిండనున్న సాగర్
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 3,69,866 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 537.4 అడుగుల వద్ద 182.95 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 130 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సాగర్ నిండుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,64,019 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో పది గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,31,370 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 24,917, ఎడమ కేంద్రం నుంచి 35,315 వెరసి 4,91,602 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్లోకి చేరుతున్న వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. తుంగభద్రలో కూడా వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్లోకి 1,98,109 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 1,79,973 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటిమట్టం 311 మీటర్ల(సముద్రమట్టానికి)కు చేరుకుంది. దీంతో మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాదహెచ్చరికను జారీచేసి నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరగనుంది. గోదావరిలో తగ్గుతున్న వరదవర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద క్రమేణా తగ్గుతోంది దీంతో మేడిగడ్డ బరాజ్లోకి 3.62 లక్ష లు, తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్లోకి 6.26, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్లోకి 8.07 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. వచి్చన వరదను వచి్చనట్టుగా వదిలేస్తున్నారు. భద్రా చలం వద్ద వరద 8.41 లక్షల క్యూసె క్కులకు తగ్గడంతో నీటిమట్టం 40 అడుగులకు తగ్గింది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎట్టకేలకు నిండింది. మహారాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా నుంచి భారీగా వరద జలాలు వచ్చి చేరుతుండటంతో మూడేళ్ల అనంతరం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ నుంచి 83 వేల క్యూసెక్కుల భారీ వరద పోటెత్తడంతో సోమవారం ఉదయం 16 గేట్లను ఎత్తి 75 వేల క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి వదిలారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా మరో ఐదు వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా మూడు వేల క్యూసెక్కులు.. మొత్తం 83 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి ప్రాజెక్టులోకి 83 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 (90 టీఎంసీ) అడుగులు. మూడేళ్ల తర్వాత..: మూడేళ్ల అనంతరం ఎస్సారెస్పీ గేట్లను ఎత్తారు. 2016 సెప్టెంబర్లో ఇలాగే భారీగా వరద జలాలు పోటెత్తాయి. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి అప్పట్లో లక్షలాది క్యూసెక్కులు నదిలోకి వదిలారు. 2013లోనూ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. ఇలా ప్రతి మూడేళ్లకు ఒకసారి గేట్లు ఎత్తే పరిస్థితి నెలకొంది. గత ఏడాది 2018 అక్టోబర్ 21న ప్రాజెక్టులో కేవలం 41 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. 2017లోనూ ప్రాజెక్టు పూర్తిగా నిండలేదు. 2015లో ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరింది. కానీ ఈసారి అక్టోబర్లో ప్రాజెక్టు నిండటం అరుదని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు పోటెత్తారు. -
సోమశిల జలాశయానికి పెరుగుతున్న నీరు
-
ధవళేశ్వరం వద్ద పెరిగిన నీటి ఉధృతి
-
పెరిగిన శ్రీశైలం నీటిమట్టం
శ్రీశైలంప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 815.50 అడుగులకు చేరుకుంది. జూరాల నుంచి 29వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 28,448 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 37.6570 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. శ్రీశైల జలాశయ పరిసర ప్రాంతాలలో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం వరకు 4.3613 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో డ్యాం నీటిమట్టం 7.30 అడుగుల మేరకు పెరిగింది. -
802 అడుగులకు శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు (కర్నూలు): తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలోకి బుధవారం సాయంత్రానికి 3.2884 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో డ్యాం నీటిమట్టం సుమారు ఏడు అడుగుల మేర పెరిగింది. తుంగభద్ర నుంచి వచ్చే జలాలే కాకుండా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా జలాశయంలోకి వరద నీరు నెమ్మదిగా వచ్చి చేరుతోంది. 795.10 అడుగులుగా ఉన్న నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 801.90 అడుగులకు చేరుకుంది.