-
సింగపూర్లో ఉపాధ్యాయుడి వికృత చేష్టలు
సింగపూర్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సింగపూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. సింగపూర్కు చెందిన 47 ఏళ్ల వ్యక్తి ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తాను జాయిన్ అయిన మూడేళ్ల కాలంలో దాదాపు 160 మంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారి అనుమతి లేకుండా అప్స్కర్ట్ వీడియోలు,ఫోటోలు తీశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే తాజాగా కొందరు మహిళల ఫిర్యాదుతో ఆ వ్యక్తిని జూన్ 23న పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల అనుమతి లేకుండా ఫోటోలు తీయడంతో పాటు వారి గోప్యతను భంగపరిచినందుకు గాను సదరు వ్యక్తిపై చార్జీషీట్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.(భీమవరంలో యువకుడు ఆత్మహత్య) అయితే బాధితుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు ఈ ఘోరానికి పాల్పడిన వ్యక్తితో పాటు స్కూల్ పేరును చెప్పడానికి వీలు లేదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 2015 నుంచి జూలై 2018 మధ్య సదరు వ్యక్తి దాదాపు 168 మంది మహిళలు తమ దుస్తులు మార్చుకుంటున్న వీడియోలను వీడియోలు తీశాడు. ఇందులో మొదటి ఎనిమిది వీడియోలు 2015 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, తర్వాత ఎనిమిది 2016 మొదటి ఆరు నెలల్లో తీశాడని కోర్టు పేర్కొంది. ఇక 2017 వచ్చేసరికి ఆ సంఖ్య 105కు చేరిందని, అయితే నిందితుడు అన్ని వీడియోలను ఒకేసారి కాకుండా పాఠశాలలో నిర్వహించిన వివిధ వేడుకలను టార్గెట్ చేసుకొని తీసేవాడు. ఇలా 2018 సంవత్సరం వరకు దాదాపు 160కి పైగా అసభ్యకర వీడియోలను తీసి ఆ వీడియోలను వారికే చూసిస్తూ తనకు లొంగాలని లేకుంటే ఇవన్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. అయితే అతని ఆగడాలను భరించలేని కొందరు మహిళలు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ నిమ్మితం జూలై 14న నిందితుడు మరోసారి కోర్టుకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. అయితే దీనిపై సింగపూర్ మినిస్ట్రి ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి శుక్రవారం మాట్లాడుతూ.. ఈ విషయం తెలియగానే స్కూల్ యాజమాన్యం 2018 జూలైలోనే అతన్ని విధుల నుంచి తొలగించిందన్నారు. అప్పటినుంచి అతను ఏ స్కూల్లో పాఠాలు బోధించడం లేదని తెలిపారు. ప్రవర్తనా నియమావళి కింద క్రమశిక్షణలో విఫలమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని, వారిని పదవిలోంచి తొలగిస్తామని అన్నారు. మహిళ యొక్క గోప్యతను భంగపరిచే విధంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠినమైన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశమున్నట్లు తెలిపారు. -
బహిరంగ ప్రదేశాల్లో.. ఐఫోన్తో అసభ్య వీడియోలు
సింగపూర్: ఓ నీచుడు ఐ ఫోన్తో బహిరంగ ప్రదేశాల్లో మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించాడు. దాదాపు 60 మంది మహిళలను వారికి తెలియకుండా అర్ధనగ్న వీడియోలు తీశాడు. చివరకు గుట్టురట్టు కావడంతో కటకటాలపాలయ్యాడు. ఈ కేసులో సింగపూర్లో భారత సంతతికి చెందిన నంతకుమార్ పాల కృష్ణన్కు ఆర్నెళ్లు జైలు శిక్ష పడింది. 34 ఏళ్ల నంతకుమార్ ఐఫోన్ 4ను తన ల్యాప్టాప్ బ్యాగులో పెట్టుకుని తిరిగేవాడు. బ్యాగులో పుస్తకాల పైభాగంలో కెమెరా పైకి ఉండేలా ఐఫోన్ను ఉంచుతాడు. కెమెరాను రికార్డింగ్ మోడ్లో ఉంచి, బ్యాగుకు జిప్ వేయకుండా అలాగే వదిలేసేవాడు. స్కర్ట్లు ధరించిన మహిళలను అతను టార్గెట్ చేసేవాడు. బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళల పక్కన, వెనుక వైపున ఈ బ్యాగును కిందపెట్టేవాడు. ఇలా మహిళల అర్ధనగ్న దృశ్యాలను వీడియో తీశాడు. ఓ షాపింగ్ మాల్లో ఓ మహిళను అసభ్యంగా వీడియో తీస్తుండగా అతని బండారం బయటపడింది. నిందితుడు ఆమె వెనుక నేలపై బ్యాగ్ ఉంచాడు. ఆమె సహోద్యోగికి సందేహం వచ్చి ప్రశ్నించడంతో ఏమీ తెలియనట్టుగా క్షమాపణలు చెప్పాడు. కాగా మహిళ సహోద్యోగి బ్యాగ్ తెరిచి చూడగా, ఐఫోన్ కెమెరా రికార్డింగ్ మోడ్లో ఉన్నట్టు గుర్తించాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళతో సహా చాలా మంది మహిళల అసభ్య దృశ్యాలు అతని ఫోన్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరపరచగా ఆర్నెళ్లు జైలు శిక్ష విధించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యాదాద్రీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం
తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్కే ఉంది
ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి
అరచేతిలో ఎన్నికల సమాచారం
ఈవీఎంల కమిషనింగ్ పరిశీలన
సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్పై రాయితో దాడి
టీ20 ప్రపంచకప్కు ఉగ్ర ముప్పు
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement