breaking news
Telangana groups...
-
TG: ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈనెల 21 నుంచి 27వరకు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహించనుంది.మధ్యాహ్నం 12:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఒకటిన్నర తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులకు అనుమతించరు. ఇక ఈ నెల 14 నుంచి వెబ్ సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. అదే విధంగా పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు.ఇక గ్రూప్-1 మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి. -
రాజకీయ శక్తిగా ఎదగాలంటున్నారు
జేఏసీ భేటీలో కోదండరాం వ్యాఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో జేఏసీ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలని పలువురు కోరుకుంటున్నారని తెలంగాణ రాజ కీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించా రు. గురువారం హైదరాబాద్లో ఆయన అధ్యక్షతన జరిగిన జేఏసీ కార్యక్రమాల కమిటీ సమావేశం సందర్భంగా 22 రోజుల పాటు జరిగిన విదేశీ పర్యటనలో జరిగిన భేటీలు, వాటిలో వచ్చిన సూచనలను కోదండరాం వివరించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ సంఘాలు నిర్వహించిన సమావేశాలకు విశేష ఆదరణ దక్కిందన్నా రు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆవిర్భవించిన జేఏసీ రాజకీయాలకు అతీ తంగానే, ప్రజల పక్షాన పోరాటం చేయాలని కొందరు సూచించగా మరికొందరు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజ లకు చెప్పిన మాటలను నిజం చేయడానికి అవసరమైతే ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలని కోరినట్టుగా కోదండరాం వెల్లడించారు. రాజకీయాలకతీతంగా, ఒక రాజకీయ లక్ష్యం కోసం దీర్ఘకాలికంగా పనిచేసి విజయం సాధించడంతోపాటు నిలదొక్కుకున్న సామాజిక సంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవని పలు వర్సిటీల ప్రొఫెసర్లు విశ్లేషించినట్టు కోదండరాం చెప్పారు. ప్రపంచీకరణ విధానాలకు భిన్నం గా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రాష్ట్ర సాధన ఉద్యమం ప్రతిపాదించిందని, కానీ ఇక్కడి పాలకులు భూమిని కేంద్రంగా చేసుకుని ఆలోచనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సమావేశంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ప్రహ్లాద్, డి.పి.రెడ్డి, పురుషోత్తం, రమేశ్, ఖాజా మోహినుద్దీన్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.