-
Suchana Seth: కసాయిగా మారిన కన్నతల్లి.. కొడుకునెందుకు చంపింది?
గోవాలో కన్నకొడుకుని హతమార్చిన బెంగుళూరు సీఈఓ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్టార్టప్ కంపెనీకి సీఈఓ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్లో మేధావి అయిన మహిళ నాలుగేళ్ల పసివాడిని గోవాలో అతి కిరాతకంగా చంపిన ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అంతేగాక చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్లో కుక్కి రహస్యంగా బెంగుళూరుకు తీసుకురావడాన్ని తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పుడుస్తోంది పనాజీ/ బెంగళూరు: నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో నిందితురాలిని చిత్రదుర్గ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కన్నతల్లి అంత కసాయిరాలుగా ఎందుకు మారింది.. పేగు బంధాన్ని తెంపుకొని కొడుకును హత్య చేయడానికి గల కారణాలేంటనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని చంపేందుకు అదే కారణమా? 39 ఏళ్ల సుచనకు, ఆమె భర్త వెంకట్ రామన్కు మధ్య వివాదాలే చిన్నారి హత్యకు దారితీసినట్లు గోవా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీఈఓకు భర్త వెంకట్ రామన్ మద్య గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే కుమారుడిని భర్త నుంచిదూరంగా ఉంచేందుకు గోవా టూర్ ప్లాన్ చేసింది. గత శనివారం నార్త్ గోవాలోని బనియన్ గ్రాండ్ హోటల్లో దిగింది. తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని హతమార్చింది. అనంతరం బెంగుళూరుకు ట్యాక్సీ బుక్ చేయాలని ఆమె హోటల్ సిబ్బందిని కోరింది. కొడుకుతో కలిసి హోటల్ లోపలికి వెళ్లిన మహిళా.. సోమవారం ఒంటరిగా బయటికి వెళ్లడాన్ని గమనించిన సిబ్బందికి అనుమానం రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ రక్తపు మరకలను గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంబంధిత వార్త: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అపర మేధావి.. ఎవరీ సుచనా సేథ్! బ్యాగ్లో దాచి.. గోవా నుంచి కర్ణాటకకు.. ఇంతలో ఎవరికి అనుమానం రాకుండా కొడుకు మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టిన మహిళ.. గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. మరోవైపు గోవా పోలీసులు ట్యాక్సీ డ్రైవర్కు కాల్ చేసి కుమారుడి గురించి చెప్పాలని సీఈవో సుచననాను అడిగారు. తన స్నేహితురాలి వద్ద కొడుకు ఉన్నాడని చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చింది. అయితే ఆ అడ్రస్ ఫేక్ అని తెలుసుకున్న పోలీసులు మళ్లీ క్యాబ్ డ్రైవర్కు కాల్ చేసి సుచనాకు అర్థం కాకుండా ఉండేందుకు కొంకణి భాషలో మాట్లాడారు. దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్కు వెళ్లాలంటూ ఆ డ్రైవర్కు పోలీసులు చెప్పడంతో అతడు తన కార్ను నేరుగా దగ్గర్లోని చిత్రదుర్గ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లాడు. దీంతో చిత్రదుర్గలో సుచనాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్న కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. నేరం అంగీకరించిన మహిళను.. ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు మళ్లీ గోవాకు తీసుకెళ్లారు. ఎవరీ సుచనా.. లింక్డ్ఇన్ ఫ్రొఫైల్లోని వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సుచన.. కలకత్తాలోని యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆస్ట్రోఫిజిక్స్తో పాటు ప్లాస్మా ఫిజిక్స్లో నైపుణ్యం సాధించింది. అదే విధంగా సంసృతంలో పీజీ పట్టా అందుకుంది. తరువాత ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్గా ప్రావిణ్యం పొందింది. ఈ రంగంలో ఆమెకు 12 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ క్రమంలో 2020లో మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించి.. దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది. కాగా 100 బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021లో సుచనా టాప్ ప్లేస్లో ఉన్నారు. -
హురూన్ జాబితాలో 19 ఏళ్ల వ్యాపారవేత్త
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2022లో రూ.10,94,400 కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, కుటుంబం తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.7,94,700 కోట్లతో ముకేశ్ అంబానీ, కుటుంబం రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను వరుసగా రూ.2,05,400 కోట్లతో సైరస్ ఎస్ పూనావాలా కుటుంబం (సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), రూ.1,85,800 కోట్లతో శివ్ నాడార్ కుటుంబం (హెచ్సీఎల్), రూ.1,75,100 కోట్లతో రాధాకిషన్ దమానీ, కుటుంబం (అవెన్యూ సూపర్మార్ట్స్) దక్కించుకుంది. రూ.1,000 కోట్లకుపైగా సంపద కలిగిన వ్యాపారవేత్తలతో ఈ జాబితా తయారైంది. ఇందులో దేశవ్యాప్తంగా 1,103 మంది చోటు సంపాదించారు. గతేడాదితో పోలిస్తే 96 మంది కొత్తగా చేరారు. లిస్ట్లో స్థానం పొందిన వ్యాపారవేత్తల మొత్తం సంపద రూ.100 లక్షల కోట్లకు చేరుకుంది. 19 ఏళ్ల యువ వ్యాపారవేత్త, జెప్టో ఫౌండర్ కైవల్య వోరా జాబితాలో ఉన్నవారిలో పిన్న వయస్కుడు. తెలుగు రాష్ట్రాల నుంచి.. జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 78 మంది చోటు సంపాదించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రూ.56,200 కోట్ల సంపదతో మురళి దివీ, కుటుంబం (దివీస్ ల్యాబొరేటరీస్) మొదటి స్థానంలో ఉంది. రూ.39,200 కోట్లతో బి.పార్థ సారధి రెడ్డి, కుటుంబం (హెటిరో ల్యాబ్స్) రెండవ స్థానం కైవసం చేసుకుంది. రూ.16,000 కోట్లతో ఎం.సత్యనారాయణ రెడ్డి కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్), రూ.15,000 కోట్లతో జి.అమరేందర్ రెడ్డి, కుటుంబం (జీఏఆర్), రూ.13,300 కోట్లతో రామేశ్వర్రావు జూపల్లి కుటుంబం (మై హోమ్ ఇండస్ట్రీస్) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూ.12,600 కోట్లతో పి.పిచ్చిరెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఆరవ స్థానం, రూ.12,100 కోట్లతో పి.వి.కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఏడవ స్థానం, రూ.11,300 కోట్లతో కె.సతీష్ రెడ్డి, కుటుంబం (డాక్టర్ రెడ్డీస్) ఎనిమిదవ స్థానం, రూ.9,000 కోట్లతో వెంకటేశ్వర్లు జాస్తిని కుటుంబం (సువెన్ ఫార్మా) తొమ్మిదవ స్థానం, రూ.8,700 కోట్లతో మహిమ దాట్ల కుటుంబం (బయాలాజికల్–ఇ) 10వ స్థానంలో నిలిచారు. -
స్టార్టప్ ఇండియాతో అమెజాన్ జట్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ సంస్థలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఇందులో భాగంగా స్టార్టప్ ఇండియా, సెకోయా క్యాపిటల్ ఇండియా, ఫైర్సైడ్ వెంచర్స్తో చేతులు కలిపినట్లు, స్టార్టప్స్ కోసం యాక్సిలరేటర్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రొపెల్ (ఏజీఎస్పీ) పేరిట రూపొందించిన ఈ ప్రోగ్రాంలో భాగంగా దేశ, విదేశాలకు చెందిన అమెజాన్ లీడర్స్, స్టార్టప్ ఇండియాకి సంబంధించిన వెంచర్ క్యాపిటలిస్టులు, సీనియర్ లీడర్లు.. మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. ఎంపిక చేసిన 10 అంకుర సంస్థలకు ఆరు వారాల పాటు ఈ–కామర్స్ ద్వారా ఎగుమతుల వ్యాపారాన్ని పెంచుకునేందుకు తోడ్పడే మెళకువలను వివరిస్తారు. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా ఆయా స్టార్టప్లు తమ తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకునేందుకు అమెజాన్ తోడ్పాటు అందిస్తుంది. అంతే గాకుండా సెకోయా క్యాపిటల్, ఫైర్సైడ్ వెంచర్స్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలకు తమ వ్యాపార సామర్థ్యాలను గురించి వివరించేందుకు కూడా స్టార్టప్లకు అవకాశం దక్కుతుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (గ్లోబల్ ట్రేడ్) అభిజిత్ కామ్రా తెలిపారు. వీటిలో మూడు అంకుర సంస్థలు.. అమెజాన్ నుంచి 50,000 డాలర్ల గ్రాంట్ కూడా దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. -
బైజూస్ మరో రికార్డు
సాక్షి, ముంబై: 4 కోట్ల రికార్డు డౌన్లోడ్లతో దూసుకుపోతున్న ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ బైజూస్ తాజాగా భారీ పెట్టుబడులను సాధించింది. న్యూయార్క్ కేంద్రంగా ఉన్న హెడ్జ్ ఫండ్ సంస్థ టైగర్ గ్లోబల్ నుంచి 200 డాలర్లను పెట్టుబడులను కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ బైజూస్ వ్యవస్థాపకుడు సీఈవో రవీంద్రన్ ప్రకటించారు. దీంతో బెంగళూరుకేంద్రంగా పనిచేస్తున్న బైజూస్ వాల్యూ 8 బిలియన్ల డాలర్లు మించిపోతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనితో 2015 లో స్థాపించబడిన బైజూస్ భారతదేశంలో మూడవ అత్యంత విలువైన స్టార్టప్గా అవతరించింది. టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ వంటి బలమైన పెట్టుబడిదారుడితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని బైజూస్ సీఈవో తెలిపారు. విద్యార్థులు నేర్చుకునే విధానంలో పలుమార్పులు తీసుకురావాలన్న తమ దీర్ఘకాలిక దృష్టికి, ఆవిష్కరణలకు మరో అడుగు ముందుకు పడినట్టు రవీంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. టైర్ 2, 3 నగరాల్లో అభ్యాసకులకు అందుబాటులో ఉండేలా మాతృభాషలో తమ ప్రోగ్రామ్లను ప్రారంభించటానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు రాబోయే నెలల్లో ఆన్లైన్ పాఠాలకోసం ఒక స్టార్ట్-అప్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. గత 12 నెలల్లో, గ్రామీణ, పట్టణాల్లో 42 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లు, 3 మిలియన్ల చెల్లింపు చందాదారులు తమ యాప్లో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే సంస్థ ప్రకారం, ఒక విద్యార్థి అనువర్తనంలో గడిపే సగటు నిమిషాల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే రోజుకు 64 నిమిషాల నుండి 71 నిమిషాలకు పెరిగింది. వార్షిక సభ్యత్వాల రెన్యూవల్ రేట్లు 85శాతం పుంజుకుంది. మరోవైపు భారతదేశంలో మిలియన్ల మంది పాఠశాల విద్యార్థుల మన్ననలు పొందుతూ, విద్య-సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న బైజూస్ బృందానికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని టైగర్ గ్లోబల్ భాగస్వామి స్కాట్ ష్లీఫర్ తెలిపారు. -
ఐదు స్టార్టప్లతో మారుతి జత
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) నూతన ఆవిష్కరణలకోసం కీలక నిర్ణయం తీసుకుంది. తన మొబిలిటీ అండ్ ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద ఐదు స్టార్టప్లను ఎంపిక చేసినట్లు సోమవారం తెలిపింది. ప్రధానంగా కృత్రిమ మేధస్సు పై పనిచేస్తున్న సెన్స్ గిజ్, క్సేన్, ఐడెంటిఫై, ఎన్మోవిల్, డాకెట్రన్ అనే ఐదు స్టార్టప్లతో జతకట్టింది. ఈ ఒప్పందాల ద్వారా ఆటోమొబైల్ రంగంలో వినూత్న, అత్యాధునిక సొల్యూషన్స్తో ముందుకు వస్తున్న స్టార్టప్లను గుర్తించి, ఒకచోటకు తీసుకొచ్చినట్టు తెలిపింది. మారుతి సుజుకి వాటాదారుల ప్రయోజనాలను నిలుపుకుంటూ, భారతీయ కస్టమర్ల అవసరాలకు అవసరాల కంటే ముందుగానే అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీ సేవలను అందిచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎంఎస్ఐ ఎండి, సీఈవో కెనిచి ఆయుకావా వెల్లడించారు. ఈ స్టార్టప్లతో భాగస్వామ్యం కావడం ద్వారా ఆటోమొబైల్ సొల్యూషన్ కొత్త యుగంలోకి ప్రవేశించామన్నారు. స్టార్టప్లతో పాటు పనిచేయడం ద్వారా పరిష్కారాల స్కేలబిలిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇవి కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. ప్రస్తుతానికి మారుతి సుజుకిలోని డొమైన్ నిపుణుల మార్గనిర్దేశనంపాటు, భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ స్టార్టప్ మార్కెట్ నిపుణుల ద్వారా మొత్తం ఐదు స్టార్టప్లకు మూడు నెలల సుదీర్ఘ యాక్సలరేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
Advertisement