breaking news
Srinivas vangapalli
-
‘వరంగల్’ స్థానం వంగపల్లికి ఇవ్వండి
సీఎంకు తెలంగాణ ఎంఆర్పీఎస్ వినతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంతో పాటు మాదిగ సామాజిక కార్యక్రమాల్లో తొలి నుంచీ అగ్రభాగంలో నడుస్తున్న వంగపల్లి శ్రీనివాస్కు వరంగల్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఎంఆర్పీఎస్ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులంతా ఆదివారం సమావేశమయ్యారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో మాదిగ కులస్తుల నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం లేదని వారీ సందర్భంగా చెప్పారు. అతిపెద్ద సామాజిక వర్గమైన తమకు గుర్తింపునిస్తూ శ్రీనివాస్ను పోటీకి దింపితే, భారీ మెజారిటీతో గెలిపించి ఆ స్థానాన్ని సీఎంకు కానుకగా ఇస్తామన్నారు. -
ఎర్రబెల్లికి గుణపాఠం చెబుతాం:వంగపల్లి
ముషీరాబాద్: దళిత నేత, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని అవమానించే విధంగా పదేపదే మాట్లాడుతున్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావుకు మాదిగలు తగిన గుణపాఠం చెబుతారని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. గురువారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి ద్రోహం చేసిన ఎర్రబెల్లికి కడియం శ్రీహరిని విమర్శించే హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడు ఉప ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకే ఎర్రబెల్లి ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇకపై విమర్శలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దండు సురేందర్, గడ్డం అంజన్న, విజయరాజు, ఇటుక గోపి, పొన్నాల కుమార్, మనోజ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.