breaking news
sreenivasulu
-
‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’
భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి సాధించాలంటే బలమైన ప్రైవేట్ మూలధన వ్యయం(private capital expenditure), వినియోగం పెరగాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. రూ.52 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లున్న ఎస్బీఐ బ్యాంక్కు ఈయన ఇటీవల ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తూ, భవిష్యత్తు వృద్ధిని అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేశారు.దేశాభివృద్ధికి ప్రస్తుతం కొన్ని రంగాల్లో ప్రైవేటు మూలధన వ్యయం జరుగుతుండగా ఉక్కు, సిమెంట్ వంటి కీలక పరిశ్రమలు పెట్టుబడులకు ముందుండాలని శెట్టి సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ఈ రంగాలు కీలకమని చెప్పారు. ప్రస్తుత త్రైమాసిక ఆర్థిక గణాంకాలు వృద్ధికి కీలకమైన వస్తు వినియోగంలో సానుకూల ధోరణిని సూచిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్!భారతదేశం అర్థవంతమైన పురోగతిని సాధించడానికి 8 శాతం జీడీపీ వృద్ధి రేటు అవసరమని నొక్కి చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి వినియోగం పెంపు, ప్రైవేట్ రంగ పెట్టుబడుల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టారిఫ్ సంబంధిత సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలు నెలకొంటాయని భావించడంలేదని వివరించారు. -
టీడీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేదు
-
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి!.. కేంద్రానికి తెలుగువ్యక్తి పేరు సిఫారసు
ఎస్బీఐ కొత్త ఛైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) సిఫారసు చేసింది. ఈ పదవి కోసం ప్యానల్ ముగ్గురుని ఇంటర్వ్యూ చేసి చల్లాను ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదించింది. పనితీరును దృష్టిలో ఉంచుకుని ఈయన పెరుగు ప్రతిపాదించినట్లు ఎఫ్ఎస్ఐబీ పేర్కొంది.ఎస్బీఐ కొత్త ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ప్రతిపాదించినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత ఛైర్మన్గా ఎవరనేది అధికారికంగా వెలువడుతుంది.Recommendation for the position of Chairman in State Bank of India. Official Announcement onhttps://t.co/AEcyakCCQ9 pic.twitter.com/29NdHpGjAL— Financial Services Institutions Bureau (@FSI_Bureau) June 29, 2024ప్రస్తుతం ఎస్బీఐ ఛైర్మన్గా దినేశ్ కుమార్ ఖారా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2020 అక్టోబర్ 7న ఎస్బీఐ ఛైర్మన్గా ఎంపికయ్యారు. అయితే ఈయన పదవీకాలం గత ఏడాది అక్టోబర్లోనే ముగిసింది. కానీ కేంద్రం మళ్ళీ మళ్ళీ పొడిగించింది. కాగా ఈయన ఆగష్టు 28వరకు ఎస్బీఐ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తరువాత ఈ స్థానంలోకి కొత్త ఛైర్మన్ వస్తారు.ఇక చల్లా శ్రీనివాసులు శెట్టి విషయానికి వస్తే.. ఈయన ప్రస్తుత గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. అక్కడే ప్రాధమిక విద్యను పూర్తి చేసి.. ఆ తరువాత హైస్కూల్, ఇంటర్మీడియట్ గద్వాల్లో పూర్తి చేశారు. ఆ తరువాత అగ్రికల్చర్ పూర్తి చేశారు. ఈయన 1988లో ఎస్బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్గా తన వృత్తి ప్రారంభించారు. బ్యాంకింగ్ రంగంలో ఈయనకు సుమారు 36 సంవత్సరాలు అనుభవం ఉంది. -
అసెంబ్లీలో విపక్షానికి వింత పరిస్థితి
♦ కరువుకు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధం లేదా..! ♦ వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే పదే పదే మైక్ కట్ ♦ జగన్ ప్రసంగానికి అడ్డుతగిలిన మంత్రులు ♦ పట్టిసీమపై మాట్లాడుతాననగానే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన జగన్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం ప్రతిపక్షానికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కరువుపై చర్చలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయాలను మాట్లాడొద్దని స్పీకర్ కట్టడి చేయడంతో ప్రతిపక్ష వైఎస్సార్సీపీని విస్మయపరిచింది. ప్రాజెక్టులపై మాట్లాడుతానన్న వైఎస్ జగన్కు పదే పదే మైక్ కట్ చేసిన స్పీకర్ అధికారపక్ష సభ్యులకు, మంత్రులకు రాజకీయ విమర్శలు చేయడానికి అవకాశం ఇవ్వడం నివ్వెరపరిచింది. కరువుపై స్వల్పకాలిక చర్చపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెబుతున్న సందర్భంలో మంత్రులు జోక్యం చేసుకుని రాజకీయ విమర్శలు గుప్పించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ హయాం లో రైతుల ఆత్మహత్యలు, పట్టిసీమ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ విమర్శించారు. మరోమంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని పట్టిసీమకు అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగితే సమాధానం చెప్పలేదని విమర్శించారు. ఆ తర్వాత స్పీకర్ మైక్ ఇవ్వడంతో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, మంత్రులు లేవనెత్తినందున పట్టిసీమ గురించీ చెబుతానన్నారు. మంత్రులు అడిగిన దానిపై వైఎస్ జగన్ ఒక్కమాట చెప్పారో లేదో స్పీకర్ మైక్ కట్ చేశారు. కరువు, నీటిపారుదల ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి సంబంధం ఉందని జగన్ చెబుతున్నా... స్పీకర్ వినిపించుకోకుండా మైక్ కట్ చేసి, స్పీక్ ఓన్లీ ఆన్ డ్రవుట్(ఒక్క కరువు మీదే మాట్లాడాలి), నథింగ్ ఎల్స్(మరో విషయం మాట్లాడటానికి వీల్లేదు), దట్ ఎజెండా ఈజ్ ఓవర్(ఆ అంశం అయిపోయింది) అన్నారు. ఈ విషయాలు చెబుతూ మాట్లాడమని జగన్కు అవకాశమివ్వగా, పట్టిసీమ అనగానే ఎందుకు భయపడుతున్నారు? సందర్భం వచ్చినప్పుడు దానిపైనా మాట్లాడుతానన్నారు. దానికి స్పీకర్ తీవ్రంగా స్పందిస్తూ, కరువు మీద మాట్లాడండి.. లేదా మీ ఇష్టం... అని అన్నారు. అధ్యక్షా... పట్టిసీమ మాట ఎత్తగానే భయపడుతున్నారు. ఇక్కడేం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు అని చెబుతుండగానే మళ్లీ మైక్ కట్..! వైఎస్సార్సీపీ సభ్యులు మూకుమ్మడిగా నిరసన తెలియజేయగా మాట్లాడే అవకాశమిచ్చారు. పట్టిసీమ అనగానే మైక్ కట్ చేస్తున్నారెందుకు అధ్యక్షా...! అని జగన్ ప్రశ్నించారు. అలా అంటుండగానే స్పీకర్ మైక్ కట్ చేసి ప్రభుత్వ చీఫ్విప్ కాల్వ శ్రీనివాసులును మాట్లాడాలని కోరారు. దానికి కాల్వ శ్రీనివాసులు వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఇదే క్రమంలో స్పీకర్ జగన్నుద్దేశించి మాట్లాడుతూ, గంటలు... గం టలు మాట్లాడతా అంటే కుదరదు. డోంట్ డీవియేట్ ఫ్రమ్ ది సబ్జెక్ట్(మాట్లాడాల్సిన అం శంపై పక్కకు వెళ్లొద్దు) అని అన్నారు. దానిపై జగన్ స్పందిస్తూ... ప్రజలు చూస్తున్నారు.. అధ్యక్షా...! ఎందుకు మైక్ కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దాంతో మళ్లీ మైక్ కట్ చేసిన స్పీకర్ మరోసారి కాల్వ శ్రీనివాసులును మాట్లాడాలని కోరారు. దానికి ఆయన ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఈ దశలో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు తీవ్ర నీటిఎద్దడితో అలమటిస్తున్నారని, సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులకు సంబంధం ఉందం టూ విపక్ష సభ్యులు పోడియం ముందుకొచ్చి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలోనే అధికారపార్టీ సభ్యులు, మంత్రులు ఒక్కొక్కరుగా మాట్లాడటానికి అవకాశం రాగా, ప్రతిపక్షంపై విమర్శలుగుప్పించడంపైనే ఎక్కువ సమ యం తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాల్వ శ్రీనివాసులు ఎదురుదాడి కొనసాగిస్తుం డగానే మధ్యలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని వైఎస్ సీఎంగా ఉండగా రూ.లక్షన్నర మాత్రమే పరిహారమిచ్చారని, చంద్రబాబు రూ.5 లక్షలిచ్చారని చెప్పుకొచ్చారు. అనంతరం మళ్లీ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులపై జగన్కు, ఆయన తండ్రి వైఎస్కు అభిమానం లేదని, ఓదార్పుయాత్ర చేయడం ఒక అలవాటుగా మారిందం టూ పొంతనలేని విమర్శలు గుప్పించారు. మధ్యలో మరోసారి అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ సభ్యుడు, డిప్యూటీ సీఎం మాట్లాడగానే స్పీకర్ అర్ధంతరంగా సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.